న్యూఢిల్లీ : నిత్యం మారుతున్న టెక్నాలజీతో పాటు సాంకేతిక చెల్లింపుల వ్యవస్ధల క్రమబద్ధీకరణ, సమర్ధ నిర్వహణ కోసం అంతర్జాతీయంగా సమిష్టి కార్యాచరణ అవసరమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల నియంత్రణకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్న నేపధ్యంలో ఆర్ధిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ స్ధాయిలో సాంకేతిక చెల్లింపుల వ్యవస్ధపై నియంత్రణకు ప్రణాళికలు రూపొందిస్తున్నా అంతర్జాతీయంగా నియంత్రిత వ్యవస్ధ ఉండాలని ఆమె అన్నారు. శుక్రవారం జరిగిన ఇన్ఫినిటీ ఫోరం 2021లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సాంకేతికతకు భౌగోళిక సరిహద్దులు ఉండవని, సమర్ధ నిర్వహణ కోసం అంతర్జాతీయ కార్యాచరణ కీలకమని అన్నారు.