Nirmala on BC Technology | బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని వాడకంలో అంతర్లీనంగా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భవిష్యత్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకం పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బ్లాక్ చైన్ టెక్నాలజీగా పిలుస్తున్న డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) వాడకానికి ప్రభుత్వం తప్పనిసరిగా మద్దతునిస్తుందన్నారు.
మన వాలెట్లలో వెంట తీసుకెళ్తున్న పేపర్ కరెన్సీకి సమకాలీనంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్గా ఆర్బీఐ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆవిష్కరించనున్నది. సీబీడీసీకి బడ్జెటరీ ప్రకటన వెలువడనుండగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డీఎల్టీ అద్భుతమైన టెక్నాలజీ అని సీతారామన్ పేర్కొన్నారు. ఇది ప్రజాతంత్రీకరణకు చేయూతనిస్తుందని చెప్పారు. కానీ అంతర్లీనంగా పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే టైంలో బిట్ కాయిన్ వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ అసెట్స్ భారత్లో స్వేచ్ఛగా వ్యాపిస్తున్నాయన్నారు.