న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: హైదరాబాదీ ఔషధ రంగ సంస్థ గ్లాండ్ ఫార్మాలో లకుమి ట్రస్ట్, నికోమాక్ మెషినరీ సంస్థలు మంగళవారం 4.92 శాతం వాటాను అమ్మేశాయి. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో జరిగిన ఈ వాటాల విక్రయం విలువ రూ.1,411.57 కోట్లు. ఇరు సంస్థలు కలిసి ప్రత్యేక బల్క్ డీల్స్లో 81.20 లక్షల షేర్లను అమ్మేయగా, ఇందులో లకుమి ట్రస్ట్ 61.65 లక్షల షేర్ల (3.74 శాతం వాటా)ను, నికోమాక్ మెషినరీ 19.55 లక్షలకుపైగా షేర్ల (1.18 శాతం వాటా)ను విక్రయించాయి. షేర్ ధరల శ్రేణి రూ.1,735.31-1,739.10గా ఉన్నది. కాగా, ఈ విక్రయంతో గ్లాండ్ ఫార్మాలో నికోమాక్ తమ పూర్తి వాటాను వదులుకున్నైట్టెంది. అయితే గ్లాండ్ ఫార్మాలో 57.86 శాతం వాటాతో చైనాకు చెందిన ఫోసున్ ఫార్మా ప్రధాన ప్రమోటర్గా ఉన్నది. ఇక సోమవారం ముగింపుతో పోల్చితే ఎన్ఎస్ఈలో గ్లాండ్ ఫార్మా షేర్ విలువ 2.83 శాతం దిగజారి రూ.1,807 వద్ద స్థిరపడింది.