న్యూఢిల్లీ, మార్చి 8: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్..తాజాగా నూతన మధ్యస్థాయి సెడాన్ వర్తూస్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం విడుదల చేసిన ఈ కారు..మే నెలలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్, స్కోడా స్లావియాలకు పోటీగా సంస్థ ఈ మోడల్ను పరిచయం చేసింది. 1 లీటర్, 1.5 లీటర్ల టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్తో రూపొందించిన ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభించనున్నది. ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ మొబైల్ చార్జింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి.