న్యూఢిల్లీ : భారత్లో న్యూ రేంజ్ రోవర్ డెలివరీలు ప్రారంభమయ్యాయని కంపెనీ మంగళవారం వెల్లడించింది. జనవరి 2022లో న్యూ రేంజ్ రోవర్ బుకింగ్స్ను ల్యాండ్ రోవర్ ఓపెన్ చేసింది. కంపెనీ ఫ్లాగ్షిప్ ఎస్యూవీగా పేరొందిన రేంజ్ రోవర్ కార్లు రూ 2.38 కోట్ల నుంచి రూ 3.43 కోట్ల మధ్య అందుబాటులో ఉన్నాయి.
రేంజ్ రోవర్ ఎస్ఈ, హెచ్ఎస్ఈ, ఆటోబయోగ్రఫీ మోడళ్ల డెలివరీలు ప్రారంభమయ్యాయని, ఎక్ల్సూజివ్ ఎస్వీ వేరియంట్స్ రానున్న నెలల్లో వినియోగదారులకు చేరే ప్రక్రియ షురూ కానుంది. అత్యున్నత సాంకేతికత, ఆధునిక లగ్జరీ మేళవింపుతో న్యూ రేంజ్ రోవర్ వాహనాలు ఆకట్టుకుంటాయని జాగ్వర్, ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిండెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి పేర్కొన్నారు.
స్టాండర్డ్, లాంగ్ వీల్బేస్ వేరియంట్లలో రేంజ్ రోవర్ ఐదు సీట్లను కలిగిఉంటుంది. ఎల్డబ్ల్యూబీ ఫార్మాట్లో అదనపు వరుస ఆప్షన్తో సెవెన్ సీటర్ను కూడా ఎంచుకునే వెసులుబాటు ఉంది.