ముంబై, జూన్ 24: యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన నలుపు కలర్స్ పల్సర్ 250 మోడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది బజాజ్ ఆటో. రెండు రకాల్లో లభించనున్న ఈ బైకు ధరను రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చానెల్ ఏబీఎస్ రకం మోడల్ అన్ని కలర్స్లో లభించనున్నది. పల్సర్ బైకులో భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా సరికొత్త డ్యూయల్-చానెల్ ఏబీఎస్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.