ముంబై, జనవరి 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్-నవంబర్లో ఇవి 19.76 బిలియన్ డాలర్లుకాగా, 2023లో 13.54 డాలర్లకు క్షీణించినట్టు రిజర్వ్బ్యాంక్ తాజా బులెటిన్ వెల్లడించింది. 2023 ఏప్రిల్-నవంబర్ నెలల్లో దేశంలోకి స్థూలంగా 21.39 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు తరలిరాగా, దేశం నుంచి 7.85 బిలియన్ డాలర్లు తరలివెళ్లాయి. దీంతో నికరంగా 13.54 బిలియన్ డాలర్లు వచ్చినట్లయ్యింది. ఎఫ్డీఐ వివరాలు..