హైదరాబాద్, జూన్ 25: బిల్డింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీలో పేరొందిన ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఎన్సీఎల్ డోర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. సికింద్రాబాద్లోని ఎస్డీ రోడ్లోగల కంపెనీ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఈ సెంటర్ను ఎన్సీఎల్ ఇండస్రీస్ ఛైర్మన్ కమలేష్ గాంధి ప్రారంభించారు. ఎన్సీఎల్ డోర్ బ్రాండ్కు చెందిన ఉత్పత్తుల శ్రేణినంతటినీ సందర్శకులు చూడవచ్చని కంపెనీ ఎండీ కె రవి తెలిపారు. తమ డోర్ సొల్యూషన్స్ డిజైన్, టెక్నాలజీని చూసేందుకు ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించాల్సిందిగా బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లను ఆహ్వానించారు.