హైదరాబాద్, మే 31: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. మే నెలలో ఏకంగా రూ.6,388 కోట్ల విలువైన మూడు ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. ఈ ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్ నుంచి రావడం విశేషం.
వీటిలో రూ.5,688 కోట్ల విలువైన ఆర్డర్ బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లభించినట్లు పేర్కొంది. మిగతా రెండు ఆర్డర్లు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏజెన్సీల నుంచి లభించినట్లు వెల్లడించింది.