నేషనల్ పెన్షన్ సీం (ఎన్పీఎస్) చిన్న, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తున్నది.
ప్రైవేట్ ఉద్యోగులకూ నెలనెలా పెన్షన్ పొందే సౌలభ్యాన్ని కల్పిస్తున్నది. ఏ ఉద్యోగం చేస్తున్నా.. ఏ రంగంలో ఉన్నా.. ఎవరైనాసరే ఈ సీంలో సులువుగా చేరవచ్చు.
నెలకు రూ.4-5 వేల పెట్టుబడితో రూ.25 వేల పెన్షన్ అందుకోవచ్చు. ఇంతకీ ఈ ఎన్పీఎస్ అంటే ఏమిటి?.. ఎలా చేరాలి?.. పన్ను ప్రయోజనం ఎంత?.. రిస్ ఉంటుందా?.. అనే అంశాలను చూద్దాం.
జాతీయ పెన్షన్ పథకాన్ని 2003లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేది. 2009లో దీన్ని దేశ పౌరులందరూ కూడా వినియోగించుకునేలా మార్పులు చేశారు.
18-70 ఏండ్ల భారత పౌరులెవరైనా ఈ సీంలో చేరవచ్చు. కేవైసీ ప్రకారం ఏదైనా గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఈ సీంలో 5.2 కోట్ల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. రూ.7.36 లక్షల కోట్ల ఆస్తులు ఎన్పీఎస్ నిర్వహణలో ఉన్నాయి.
ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ నేతృత్వంలో నడిచే సంస్థ కాబట్టి పెట్టుబడి గురించి భయపడాల్సిన పనిలేదు. అయితే ఎంచుకునే సీంనుబట్టి ఈక్విటీల్లో ఎకువగా మన పెట్టుబడులుంటే రాబడుల్లో ఒడిదుడుకులకు ఆసారం ఉంటుంది.
మారెట్లో పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పన్ను ప్రయోజన సాధనాలున్నప్పటికీ, ఇది అతితకువ నిర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్న సంస్థ. పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు గరిష్ఠంగా 0.09 శాతమే. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, నిర్వహణ వంటివన్నీ నామమాత్రమే.
ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద ఏటా రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిం చేసుకోవచ్చు. అంతేగాక టైర్ 1 సీంలో రూ.50 వేల అదనపు పెట్టుబడికి కూడా ఐటీలో అదనపు డిడక్షన్ లభిస్తుంది. మనకు లభించే కార్పస్తోపాటు నెలనెలా అందుకునే పెన్షన్పై కూడా ఎలాంటి పన్ను ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రెండు విధాల ప్రయోజనాలున్నాయి. మొదటిది ఇప్పటికిప్పుడు పన్ను ప్రయోజనం. రెండోది లాభాలు, పెన్షన్పై ట్యాక్స్ ఉండబోదు. అందుకే ఇదో బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ సాధనం.
ఎన్పీఎస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, కేఫిన్టెక్ వంటి సీఆర్ఏ ఏజెన్సీలూ ఈ అకౌంట్ ఓపెనింగ్ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.
-నాగేంద్ర సాయి కుందవరం
నెలకు కనిష్ఠంగా రూ.500లు, గరిష్ఠంగా ఎంతైనా చెల్లించవచ్చు. కోరుకున్న పెన్షన్కు అనుగుణంగా పెట్టుబడి కూడా ఉండాలి. ఇక పీపీఎఫ్) తరహాలో ఇందులో గ్యారెంటీగా ఇంత మొత్తం వస్తుందని ఉండదు. వయస్సులవారీగా, సీం ఆధారంగా రాబడులు ఉంటాయి. ఎన్పీఎస్లో 9-12 శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు.
పెన్షన్ను దృష్టిలో పెట్టుకునే ఈ స్కీం ఏర్పాటైంది. కాబట్టి సబ్స్రైబర్కు 60 ఏండ్లు వచ్చిన తర్వాతే ఇది మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు కూడా పూర్తి మొత్తాన్ని తీసుకోవడానికి వీలుండదు. అయితే 60 ఏండ్ల కంటే ముందు కూడా కొన్ని ప్రత్యేక అవసరాల కోసం నిధులను కొద్దిమొత్తంలో ఉపసంహరించుకొనే వీలున్నది.