న్యూఢిల్లీ, మే 14: రెండు ఔషధాలకు అధిక ధర వసూలు చేశారని ఆరోపణలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)..నాట్కో ఫార్మాకు రూ.4.92 కోట్ల డిమాండ్ నోటీసును జారీ చేసింది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 ప్రకారం జరిమానాతోపాటు వడ్డీ కలుపుకొని నాట్కో ఫార్మా రూ.4,92,25,923 డిపాజిట్ చేయాలని ఎన్పీపీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏప్రిల్ 2023 నుంచి నవంబర్ 2023లోపు ఈ రెండు ఔషధాలను సంస్థ అధిక ధరకు విక్రయించినట్టు వచ్చిన ఆరోపణలపై ఎన్పీపీఏ విచారణ జరిపించింది.