హైదరాబాద్లో శుక్రవారం ట్రెడా ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న సినీ హీరో నాగశౌర్య
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘హైదరబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం’ అని సినీ హీరో నాగశౌర్య అన్నారు. శుక్రవారం మాదాపూర్ హైటెక్స్లో నిర్వహించిన ట్రెడా 11వ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే విలువ తప్పక పెరుగుతుందన్నారు. ట్రెడా అధ్యక్షుడు ఆర్ చలపతిరావు మాట్లాడుతూ ఫ్లాట్ మొదలుకొని విల్లా, వ్యక్తిగత ఇల్లు, ఓపెన్ ప్లాట్లు అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఈ నెల 3 వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెడా ప్రధాన కార్యదర్శి సునీల్ చంద్రారెడ్డి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు విజయసాయి, కోశాధికారి కె శ్రీధర్రెడ్డి, బిల్డర్లు, డెవలపర్లు పాల్గొన్నారు.