హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 15 పైసలు (15 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది ఎన్ఏసీఎల్ లిమిటెడ్. ఈ ఏడాది డివిడెండ్ ప్రకటించడం ఇది మూడోసారి కావడం విశేషం. వచ్చే నెల 11న ఈ డివిడెండ్ను షేరు హోల్డర్లకు చెల్లించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.404.50 కోట్ల ఆదాయంపై రూ.15.47 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది రూ.267 కోట్ల ఆదాయంపై రూ.9 కోట్ల లాభాన్ని గడించిన విషయం తెలిసిందే.