హైదరాబాద్, ఏప్రిల్ 28 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
30 ఏండ్లకు పైగా బ్యాంకింగ్ అనుభవం ఉన్న సుధాకర్..తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ర్టాల్లో విధులు నిర్వహించారు. ఆయన గతంలో న్యూఢిల్లీ జోన్ జోనల్ హెడ్గా విధులు నిర్వహించారు.