Telsa Battery Storage Factory | ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. భారత్ మార్కెట్ లోకి ఎంటరయ్యేందుకు ముహూర్తం సిద్ధమైంది. తొలుత దేశీయ కంపెనీల భాగస్వామ్యంతో విడి భాగాల తయారీతో ప్రారంభించాలని భావిస్తున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. కొత్త వ్యూహం బయట పెట్టారు. భారత్లో ‘బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్’ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
‘పవర్ వాల్’ సిస్టమ్తో కలిసి భారత్లో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్’ ఇన్స్టాల్ చేయాలని టెస్లా ప్రతిపాదించినట్లు రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ స్టోరేజీ కోసం వినియోగించే వ్యవస్థే ‘పవర్ వాల్’. దీన్ని రాత్రి వేళ పవర్ గ్రిడ్ లేదా.. కరంట్ కోత వేళల్లో వాడుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీ స్థాపించడం కోసం పలు రకాల ఇన్సెంటివ్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు సమాచారం. కానీ, ఈ తరహా ఇన్సెంటివ్లు అందుబాటులో లేవని టెస్లా ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పారని వినికిడి.
బ్యాటరీ స్టోరేజీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని ఇటు కేంద్రం.. అటు టెస్లా యాజమాన్యం పరిశీలిస్తున్నాయి. దేశంలో టెస్లా కార్ల యూనిట్ ఏర్పాటు చేస్తే.. సుమారు రూ.20 లక్షలకే (24000 డాలర్లు) భారతీయులు ఈవీ కారు సొంతం చేసుకోవచ్చు.