Twitter Take over | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసుకోవడానికి టెస్లా సీఈవో ఎలన్మస్క్ వడివడిగా ముందుకు సాగుతున్నారు. ఎలన్మస్క్కు బాసటగా నిలిచేందుకు సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయడానికి ఒరాకిల్ గ్రూప్ కో ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్, స్కిక్యూయా క్యాపిటల్ 7.14 బిలియన్ల డాలర్లు సమకూర్చేందుకు సిద్దం అయ్యారని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపారు.
సౌదీ అరేబియాన్ ఇన్వెస్టర్ ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ కూడా ముందుకు వచ్చారు. తొలుత మస్క్ ప్రతిపాదనను వ్యతిరేకించినా తదుపరి 1.89 బిలియన్ల డాలర్ల విలువైన వాటా తీసుకోవడానికి అంగీకరించారు. ల్యారీ ఎల్లిసన్, స్కిక్యూయా క్యాపిటల్, సౌదీ అరేబియన్ ఇన్వెస్టర్ ప్రిన్స్ ప్రతిపాదనలతో ఎలన్మస్క్ తీసుకోనున్న రుణం 12.5 బిలియన్ల డాలర్ల నుంచి 6.25 బిలియన్ల డాలర్లకు తగ్గనుంది.
ఇక ట్విట్టర్ కో-ఫౌండర్ అండ్ మాజీ సీఈవో జాక్ డోర్సీతోపాటు సంస్థ వాటాదారులతోనూ చర్చలు కొనసాగించనున్నారు. ఖతార్ హోల్డింగ్, దుబాయి కేంద్రంగా పని చేస్తున్న వీవై క్యాపిటల్, మస్క్ వెంచర్ కంపెనీ బోరింగ్ కూడా ఈ ఇన్వెస్టర్ గ్రూప్లో భాగస్వామి కానున్నది.