Elon Musk in Twitter Board | మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డులోకి టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్మస్క్ నియమితులయ్యారు. ఈ సంగతిని భారత సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మంగళవారం తెలిపారు. ట్విట్టర్లో 2024 వరకు క్లాస్ టూ డైరెక్టర్గా కొనసాగుతారు. ట్విట్టర్లో ఎలన్మస్క్ 9.2 శాతం వాటా కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 300 కోట్ల డాలర్లు ఉంటుంది.
ఎలన్మస్క్ను మన సంస్థ బోర్డులో డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రకటించడానికి నేను ఆసక్తితో ఉన్నా. కొన్ని రోజులుగా ఈ విషయమై ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నా. మన బోర్డులో మస్క్ డైరెక్టర్గా ఉండటం గొప్ప మార్పు తీసుకొస్తుంది అని పరాగ్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
పరాగ్ అగర్వాల్ ట్వీట్కు ఎలన్మస్క్ రిప్లయ్ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్లో గణనీయ మార్పులు తసుకొస్తాం. అందుకు పరాగ్ అగర్వాల్తోనూ, ట్విట్టర్ బోర్డుతోనూ కలిసి పని చేస్తూ ముందుకు సాగేందుకు వేచి చూస్తున్నా.. అని ట్వీట్ చేశారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్లో తాజాగా ట్విట్టర్ చేసిన ఫైలింగ్ ప్రకారం 2024 వాటాదారుల సమావేశం వరకు ఎలన్మస్క్ సంస్థ డైరెక్టర్గా కొనసాగుతారు.