హైదరాబాద్, ఆగస్టు 14: మల్టీబ్రాండ్ రిటైల్ దిగ్గజం టచ్ మొబైల్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్ను ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచితంగా మొబైల్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ను తమ దగ్గర్లోని టచ్ స్టోర్ను సందర్శించి ఆధార్ కార్డులోని జన్మదినాన్ని చూపించి ఫీచర్(మల్టీ మీడియా) మొబైల్ ఫోన్ను పొందవచ్చునని, ఇందుకోసం ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతోపాటు 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది సంస్థ. అన్ని ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..అన్ని ప్రముఖ బ్రాండెడ్ యాక్ససరీస్లపై 77 శాతం వరకు రాయితీ, 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ ప్రారంభ ధర రూ.6,999, హెచ్డీఎఫ్సీ(క్రెడిట్, డెబిట్) కార్డులపై 10 శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్దతిలో సరికొత్త స్మార్ట్ఫోన్లు, ఒప్పోకి చెందిన అన్ని మొబైళ్లపై 15 శాతం వరకు క్యాష్బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది.