హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ, ఏపీల్లో అత్యంత వేగంగా విస్తరిస్తూపోతున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ లాట్.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.. అన్ని బ్రాండ్ల మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్ట్యాప్లు, స్మార్ట్ వాచీలు, హోం థియేటర్లు, లేటెస్ట్ యాక్ససరీస్లను లాట్ షోరూంలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఇన్వర్టర్లు, ప్రింటర్లూ ఉన్నాయన్నారు. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లో 150కిపైగా షోరూంలను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై మొబైల్స్ను కొనుగోలు చేయవచ్చని.. మొబైల్స్పై ఇన్సూరెన్స్, యాక్ససరీస్ అందిస్తున్నామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.