Reliance | న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతున్నది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నది. 2022లో 104 స్థానంలో ఉన్న ఆర్ఐఎల్ ర్యాంక్..ఈసారికిగాను 16 స్థానాలు ఎగబాకి 88కి చేరుకున్నది. 2021లో 155 స్థానంలో ఉన్న రిలయన్స్ ర్యాంక్..గత రెండేండ్లలో 67 స్థానాలను మెరుగుపరుచుకున్నది.
2023 ఏడాదికిగాను విడుదల చేసిన నివేదికలో భారత్ నుంచి ఎనిమిది కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ సంస్థల్లో ఎల్ఐసీ ర్యాంక్ మాత్రం పడిపోవడం విశేషం. మార్చి 31, 2023 కంటే ముందు ఆయా కంపెనీల ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది.