Mukesh Ambani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు.. ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఈశా అంబానీల విషయమై సంస్థ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదే సంస్థ డైరెక్టర్లుగా వారిని రిలయన్స్ నియమించిన సంగతి తెలిసిందే. ఆకాశ్ అంబానీ (31), ఈషా అంబానీ (31), అనంత్ అంబానీ (28) లు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు మాత్రమే ఫీజు తీసుకుంటారు. సంస్థ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోరు.
రిలయన్స్ చైర్మన్గా ముకేశ్ అంబానీ.. 2020-21 నుంచి ఎటువంటి వేతనం అందుకోవడం లేదు. వచ్చే ఐదేండ్ల వరకూ రిలయన్స్ చైర్మన్ కం సీఈఓగా ముకేశ్ అంబానీ కొనసాగనున్నారు. వచ్చే ఐదేండ్లలో ముకేశ్ అంబానీ.. తమ వారసులకు సాధికారత కల్పించడంపై మార్గ నిర్దేశనం చేస్తారు.
రిలయన్స్లో ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నిఖిల్, హిటల్ తదితరులు వేతనం, అలవెన్సులు, కమిషన్లు అందుకుంటారు. ఇక 2014 నుంచి సంస్థ బోర్డు డైరెక్టర్గా నియమితులైన ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బోర్డు సమావేశాలకు హాజరైనందుకు రూ.6 లక్షల ఫీజు, రూ.2 కోట్ల కమిషన్ తీసుకున్నారు.
ఇటీవల జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో నీతా అంబానీ.. బోర్డు డైరెక్టర్గా వైదొలిగారు. 2022లో రిలయన్స్ వారసత్వ ప్రణాళికను ముకేశ్ అంబానీ ప్రవేశ పెట్టారు. రిలయన్స్ టెలికం డివిజన్కు ఆకాశ్ అంబానీ, రిటైల్ విభాగానికి ఈషా అంబానీ, నూతన ఇంధన రంగ వ్యాపార వ్యవహారాలను అనంత్ అంబానీకి అప్పగించారు.