హైదరాబాద్, ఫిబ్రవరి 29: ప్రముఖ పప్పుదినుసుల సంస్థ ఎంటీఆర్.. తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గడిచిన మూడేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో రూ.100 కోట్ల వరకు పెట్టుబడిపెట్టిన సంస్థ..తాజాగా తన వ్యాపార విస్తరణలో భాగంగా గుంటూరులో రూ.30 కోట్లతో సరికొత్త యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు కంపెనీ సీఈవో సునయ్ భాసిన్ తెలిపారు.
సంస్థ ఆదాయంలో తెలుగు రాష్ర్టాల నుంచి అధికంగా సమకూరుతుండటంతో ఇక్కడి మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.