Motorola Edge40 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా.. భారత్ మార్కెట్లో.. మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ రూ.27,999లకు లభ్యం అవుతుంది. 8జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ రామ్ అండ్ 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఆన్ బోర్డ్ స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నది.
మూడు కలర్ ఆప్షన్లు .. నెబులా గ్రీన్, ఎపిలిప్స్ బ్లాక్, లునార్ బ్లూ కలర్స్లో లభిస్తున్నది. 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 4400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఫర్ 68వాట్ల టర్బో పవర్ చార్జింగ్ ఫెసిటిలీతో అందుబాటులోకి వస్తున్నది. మోటరోలా ఎడ్జ్ 40 ఇప్పటికే యూరప్ మార్కెట్లో ఆవిష్కరించారు.
ఈ నెల 23 నుంచి మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.5000 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2000 మినహాయింపు ఉండవచ్చు. డ్యుయల్ స్పీకర్ సెటప్ విత్ డోల్బీ ఆట్మోస్ సౌండ్ ఆప్షన్ కలిగి ఉంటుంది.