న్యూఢిల్లీ : భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో పలు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన మొటొరోలా మరో స్మార్ట్ఫోన్ను త్వరలో లాంఛ్ చేయనుంది. నవంబర్లో మోటో జీ51ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్ధమైందని భావిస్తున్నారు. త్వరలో లాంఛ్ కానున్న మోటో జీ51 స్పెసిఫికేషన్స్ను ఇటీవల ఓ వెబ్సైట్ లీక్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్తో కస్టమర్ల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. మోటో జీ50 5జీ కొనసాగింపుగా మోటో జీ51ను లాంఛ్ చేస్తున్నారని ఈ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్స్ను లీక్ చేసిన టెక్నిక్ న్యూస్ పేర్కొంది.
క్వాల్కాం ప్రాసెసర్ నుంచి మొటొరోలా డైమెన్సిటీకి మారినట్టు వెల్లడించింది. మోటో జీ50లో మొటొరోలా క్వాల్కాం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను వాడింది. ఇక జీ51 5జీలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్ ఉంటాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రధానంగా కస్టమర్లను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. భారత్లో ఈ స్మార్ట్ఫోన్ రూ 15,000లోపు ధరలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.