Maruti Jimny | ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి ఆవిష్కరించిన `జిమ్న` కారు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ ఆఫ్ రోడర్ ఎస్యూవీ.. చాలా మందిని ఆకర్షిస్తున్నది. ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించిన తొలి రెండు రోజుల్లోనే మూడు వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ నెల 12న మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్ రోడర్ ఎస్యూవీని ఎక్స్పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14 నాటికి 2,500 బుకింగ్స్ నమోదయ్యాయని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. జిమ్నీ ఆఫ్ రోడర్ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చాక, బుకింగ్ చేసుకున్న వారు దాని కోసం కనీసం మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తుందని అంచనా వేశారు.
జిమ్నీ కారు ధర రూ.10 నుంచి రూ.12 లక్షలు పలుకుతుంది. దేశవ్యాప్తంగా తన ప్రీమియం డీలర్షిప్ నెక్సా వద్ద ఆఫ్లైన్, ఆన్లైన్లలో విక్రయించనున్నది. కొనుగోలు దారులు రూ.11 వేలు పే చేసి తమ జిమ్నీని బుక్ చేసుకోవచ్చు. ఇంకా మారుతి తన జిమ్నీ ఎస్యూవీ ఆఫ్ రోడర్ ధర ఖరారు చేయలేదు. వచ్చే మార్చి నెలలో గానీ, ఏప్రిల్లో గానీ జిమ్నీ.. భారత్ రోడ్లపైకి దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఏప్రిల్లో గానీ, మే నెలలో గానీ జిమ్నీ 5-డోర్ మోడల్ ఆఫ్ రోడర్ ఎస్యూవీ ధరను మారుతి సుజుకి ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్త మారుతి సేల్స్లో ఇది బ్రెజా, గ్రాండ్ విటారా మోడల్ కార్ల మధ్యలో నిలుస్తుందని అంచనా. భారత మార్కెట్లోకి ఎంటరైన మరుక్షణం.. పోర్చ్ గుర్ఖా, మహీంద్రా థార్ వ్యాన్లకు జిమ్నీ గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.