Mahindra | దేశంలోని కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) కీలక నిర్ణయం తీసుకున్నది. తన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థను మాతృసంస్థలో కలుపుకోవాలని భావిస్తున్నది. అందుకు ఆమోదం తెలుపాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అభ్యర్థించింది. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం &ఎం), మహీంద్రా ఎలక్ట్రిసిటీ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఈఎంఎల్) మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ధి, తయారీ, విక్రయాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఎన్సీఎల్టీకి సమర్పించిన పిటిషన్లో పేర్కొంది.
విద్యుత్ వాహనాల టెక్నాలజీలో ఎంఈఎంఎల్ నైపుణ్యం సాధించింది.. ఆటోమోటివ్ డిజైన్, ఇంజినీరింగ్, ఉత్పత్తి, సోర్సింగ్ నెట్వర్క్, సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ చానెల్స్లో ఎం&ఎం నైపుణ్యం సాధించింది అని ఎన్సీఎల్టీ ముందు మహీంద్రా న్యాయవాదులు వాదించారు. ఈవీ బిజినెస్కు భవిష్యత్లో ఎం అండ్ ఎం కూడా గణనీయ పెట్టుబడులు తేనున్నది. ఈ నేపథ్యంలో ఈవీ బిజినెస్ డెవలప్ చేయడానికి ప్రతిపాదిత విలీనం కీలకం. ఎం అండ్ ఎంకు ఉన్న బెటర్ క్రెడిట్ రేటింగ్ కూడా పెట్టుబడులు సమకూర్చడంలో ఖర్చులు గణనీయంగా ఆదా చేయొచ్చునని న్యాయవాదులు వాదించారు.
గతేడాది అక్టోబర్ 31న ట్రిబ్యునల్లో మహీంద్రా పిటిషన్ దాఖలు చేసింది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్కు 846 అన్సెక్యూర్డ్ క్రెడిటర్లు రూ.485 కోట్ల రుణాలిస్తే, మహీంద్రా అండ్ మహీంద్రాకు 43,596 అన్సెక్యూర్డ్ క్రెడిటర్లు ఉన్నారు. రెండు సంస్థల రుణాలు రూ.16,535 కోట్లు ఉంటాయని తెలిపింది. ఈ నెల 10న జస్టిస్ పీఎన్ దేశ్ముఖ్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ విచారించింది. మహీంద్రా అండ్ మహీంద్రాలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఈఎంఎల్) విలీనానికి వచ్చేఆగస్టు 19న వాటాదారుల సమావేశం నిర్వహించాలని మహీంద్రా యాజమాన్యానికి సూచించింది. దీనికి గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను నిర్వహించింది.