Mahindra EV Cars | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. తదనుగుణంగా కార్ల తయారీ సంస్థలూ అధునాతన టెక్నాలజీతో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త ఎస్యూవీ కార్లను ఆవిష్కరించడంలో పోటీ పడుతున్నాయి. అదే బాటలో తామూ వెళతామని చెబుతున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. మున్ముందు యుటిలిటీ వెహికల్స్ తయారీకే ప్రాధాన్యం ఇస్తామని సంస్థ నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యుటిలిటీ వెహికల్స్తోపాటు ఈవీ కార్ల తయారీపైనా ఫోకస్ కొనసాగిస్తామన్నారు.
గతేడాది (2022-23) 6.9 లక్షల వాహనాలు విక్రయిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 11 నెలల్లోనే 8 వాహనాల మార్కును దాటేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. గత 11 నెలల్లో 7.56 లక్షల వాహనాలు విక్రయించింది. వాటిలో కార్లు, త్రీ వీలర్స్, వాణిజ్య వాహనాలు ఉన్నాయి. ఇదే ధోరణి కొనసాగితే మార్చి నెలాఖరు నాటికి ఎనిమిది లక్షల మార్కును దాటేస్తుందని చెప్పారు బనేశ్వర్ బెనర్జీ.
ఈవీ చార్జింగ్ ఎకోసిస్టమ్ దేశంలో పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకున్నా త్వరలో మూడు ఎలక్ట్రిక్ యుటిలిటీ వెహికల్స్ ఆవిష్కరిస్తామని బనేశ్వర్ బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం ఈవీ సెగ్మెంట్లో ఎక్స్ యూవీ400 ఒక్కటే ఉంది. ఫిబ్రవరి నాటికి ఎస్యూవీ సెగ్మెంట్లో 40 శాతం గ్రోత్ సాధించి 42,401 యూనిట్లు విక్రయించింది. దేశీయంగా ఎలక్ట్రిక్ యుటిలిటీ వెహికల్స్, ఎస్యూవీలు, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ ఉందని ఆయన అంచనా వేశారు.