హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఏరోస్పేస్ తయారీ, సర్వీసింగ్, ఇంజినీరింగ్, శిక్షణ సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్రంలో అనేక ఏరోస్పేస్ అనుబంధ పారులు ఉన్నాయని వివరించారు. ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పారు.
శంషాబాద్లోని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సెంటర్లో భారతీయ నేవీ కోసం అదానీ సంస్థ దేశీయంగా తయారుచేసిన ద్రిష్టి 10 స్టార్ లైనర్ మానవరహిత ఏరియల్ వాహనం (యూఏవీ) ఆవిషరణ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నదని తెలిపారు. ఏరోస్పేస్, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల రంగానికి తెలంగాణ ముఖ్యమైన కేంద్రమని పేర్కొన్నారు.
ఏరోస్పేస్ అనుబంధ రంగాలకు సంబంధించి తెలంగాణలో వెయ్యికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఉన్నాయని, స్థానిక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అంతర్జాతీయ ఏరోస్పేస్ సప్లయ్ చైన్లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుచూ ఒరిజినల్ పరికరాల తయారీదారుల (వోఈఎం)తో సప్లయ్ చైన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు.
రాష్ట్ర ఏరోస్పేస్ రంగానికి అనేక అవార్డులు
ఏరోస్పేస్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం పౌర విమానయాన శాఖ నుంచి 2018, 2020, 2022లో ఉత్తమ రాష్ట్ర అవార్డులను అందుకున్నదని, 2016-2020 మధ్యకాలంలో రాష్ట్రం నెంబర్-1 ర్యాంకు సాధించిందని దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ను భవిష్యత్లో తకువ ఖర్చతో అయ్యే ఏరోస్పేస్ సిటీగా గుర్తించిన ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్డీఏ.. తన అంతర్జాతీయ ర్యాంకింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిందని చెప్పారు.
రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకున్నదని, కేవలం 10 నెలల వ్యవధిలో యూఏవీల తయారీ కోసం మొదటి కార్బన్ ఏరొస్ట్రక్చర్స్ను నెలకొల్పిందని తెలిపారు. అదానీ సంస్థ హైదరాబాద్లో 25 సరఫరాదారులతో సంబంధాలు సాగిస్తున్నదని వివరించారు. ఆ సంస్థ డీఆర్డీవోకు ముఖ్యమైన భాగస్వామిగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. మిసైల్స్ తయారీకి హైదరాబాద్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని స్పష్టం చేశారు.