న్యూఢిల్లీ, జనవరి 26: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18.3 శాతం తగ్గి రూ.2,013 కోట్లకు పడిపోయింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,464 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.36,320 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుతం సంస్థకు రూ.75,227 కోట్ల రుణాలు ఉన్నాయి.