MINI India : కొత్తరకం ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నవాళ్లకు గుడ్న్యూస్. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ మినీ ఇండియా కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారతదేంలోని ఎలక్ట్రిక్ మినీ యూజర్లకు మినీ 360 వేరియెంట్ను అందుబాటులోకి తెచ్చింది. మినీ ఆన్లైన్ షాపులో మాత్రమే ఈ కొత్తరకం కారును అమ్మకానికి పెట్టింది. రూ.79,999 ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మూడేళ్లకు 30 వేల కిలోమీటర్లకుగానూ బైబ్యాక్ అష్యూరెన్స్గా రూ.26,46,800 చెల్లించాలని మినీ ఇండియా వెల్లడించింది. మూడో డోర్స్ ఉన్న మినీ 360 కారు డిజైన్ ఆకట్టుకుంటుందని, వినయోగదారులకు అద్బుతమైన డ్రైవింగ్ అనుభూతి ఇస్తుందని మినీ ఇండియా తెలిపింది.
బ్రిటన్కు చెందిన మార్క్ మినీ ఇండియాలో తొలిసారిగా ఆల్ హ్యాచ్బ్యాక్ ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ కారును ప్రవేశపెట్టింది. మూడు డోర్స్ ఉన్న ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 47.2 లక్షలు. మొదటిసారి మినీ కారును 1959లో తయారుచేశారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా వీటివల్ల పర్యావరణం కలుషితం కాదు. దాంతో ఈమధ్య చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా అన్నిఫీచర్లతో అదిరిపోయే కార్లును మార్కెట్లోకి తెస్తున్నాయి. టాటా టియాగో, మెర్సిడెజ్ బెంజ్, కియాలోనూ ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి.