హైదరాబాద్, ఆగస్టు 2: ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా మిని ఐపే సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జూలై 5న మినిని ఎండీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇప్పటిదాకా ఆమె ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (లీగల్ డిపార్ట్మెంట్)గా కొనసాగారు. ఎల్ఐసీకి తొలి మహిళా జోనల్ మేనేజర్గా హైదరాబాద్ ఎస్సీజడ్వోకు నేతృత్వం వహించారు. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవోగా వ్యవహరించి, ఆ కంపెనీని ఆదాయం, లాభాలపరంగా అత్యున్నతస్థాయికి తీసుకెళ్లారు.