హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్లో భరోసా భవన నిర్మాణానికి సీఎస్ఆర్లో భాగంగా రూ. 2 కోట్ల విరాళాన్ని మైండ్స్పేస్ ఆర్ఈఐటీ ప్రకటించింది. ఇందుకు
సంబంధించి మంగళవారం రూ. 2 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి కే రహేజా కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అఫీసర్(తెలంగాణ, ఏపీ) శ్రావన్ గోనె అందజేశారు.