న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తేవాలనుకుంటున్న జియో పబ్లిక్ ఇష్యూ (రూ.37,500 కోట్లు)ఆలస్యం కావచ్చన్న అంచనాలు బుధవారం క్రెడిట్సైట్స్ నుంచి వినిపించాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లోనే రావచ్చని అంటున్నారు. నిజానికి వచ్చే నెల ఆరంభంలో ఈ మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఉంటుందన్న వార్తలు వచ్చాయి.