బెంగళూరు, ఫిబ్రవరి 8: ప్రస్తుతేడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది డెవలపర్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఇందుకోసం గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కోడ్ వితౌట్ బారియర్ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు, ఈ పథకంలో భాగంగా మహిళా డెవలపర్లకు క్లౌడ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
కృత్రి మ మేధస్సు ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో దేశీయ డెవలపర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్ కింద 1,100 మంది డెవలపర్లు, టెక్నాలజీ లీడర్లు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ప్రారంభించిన కోడ్ వితౌట్ బారియర్ కార్యక్రమం ప్రస్తుత నెలలోనే భారత్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఆయన.. దీంట్లో భాగంగానే 75 వేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.