గ్లోబల్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్.. ఆపిల్ మధ్య పోటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా అత్యంత విలువ గల టెక్ జెయింట్ ఆపిల్ నిలిచింది. ఇప్పుడు ఆ స్థానాన్ని పొందడానికి మైక్రోసాఫ్ట్ పోటీ పడుతోంది. అజూర్ క్లౌడ్-కంప్యూటింగ్ బిజినెస్లో త్రైమాసికం వారీగా శక్తిమంతమైన వృద్ధి నమోదు చేసింది మైక్రోసాఫ్ట్.
దీంతో మైక్రోసాఫ్ట్ స్క్రిప్ట్ 4.2 శాతం పెరిగాయి. తత్ఫలితంగా మైక్రోసాఫ్ట్ షేర్ రికార్డు స్థాయిలో 323.17 డాలర్లకు పెరిగింది. ఇది ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.426 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది.
కానీ టెక్ దిగ్గజం ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.461 లక్షల కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్తో పోలిస్తే ఆపిల్ స్క్రిప్ట్ గురువారం 0.3 శాతం పడిపోయింది. ఐ-ఫోన్లకు ఉన్న డిమాండ్ను చేరుకునే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్లోబల్ సప్లయ్ చైన్ క్రైసిస్ను ఎలా అధిగమిస్తుందన్న విషయమై ఇన్వెస్టర్లు దృష్టిని సారించారు. క్లౌడ్ బేస్డ్ సర్వీసులతో ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ 45 శాతం పైపైకి దూసుకెళ్లింది. ఆపిల్ స్క్రిప్ట్ 12 శాతం పెరిగింది.