న్యూయార్క్, జూలై 13: ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1.80 లక్షల మంది సిబ్బందిలో ఒక్క శాతం మందిని తొలగించబోతున్నట్లు, వీరిలో ఆఫీసర్, ప్రొడక్ట్ డివిజన్ స్థాయి సిబ్బంది ఉన్నారని బ్లూంబర్గ్కు మైక్రోసాఫ్ట్ సమాచారమిచ్చింది.