న్యూఢిల్లీ, నవంబర్ 21: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. గ్లోబల్ డెలివరీ సెంటర్(జీడీసీ) అధిపతిగా అపర్ణ గుప్తాను నియమించుకున్నది. 2005లో హైదరాబాద్లో జీడీసీని ప్రారంభించిన సంస్థ..ఆ తర్వాతి కాలంలో ఈ సెంటర్లను బెంగళూరు, నోయిడాకు కూడా విస్తరించింది. మైక్రోసాఫ్ట్ కస్టమర్ అండ్ పార్టనర్ సొల్యుషన్స్(ఎంసీఏపీఎస్)లో భాగంగా అంతర్జాతీయ కస్టమర్లకు టెక్నాలజీ సేవలు అందించడానికి ఈ సెంటర్లను నెలకొల్పింది సంస్థ. జీడీసీ అధిపతిగా నియమితులైన అపర్ణ..కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ ఎక్సలెన్స్, క్లౌడ్, ఇండస్ట్రీ, పార్టనర్ ఎకోసిస్టమ్ ద్వారా అందించే సేవలకు ఆమె సారథ్యబాధతలు వహించనున్నారు.