న్యూఢిల్లీ : భారత్లో ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ను ఎంజీ మోటార్ ఇండియా బుధవారం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సేల్స్ ముగిశాయి. ఎస్యూవీ డెలివరీలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. రూ 25,000 టోకెన్ అమౌంట్తో ప్రీ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాదిలోగా 5000 ఎంజీ ఆస్టర్ యూనిట్స్ను డెలివరీ చేయాలని ఎంజీ మోటార్ ఇండియా యోచిస్తోంది.
2022 ప్రీ బుకింగ్స్ కంపెనీ అధికారిక వెబ్సైట్తో పాటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొది. ఎంజీ ఆస్టర్ హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్, స్కోడ కుషక్, వోక్స్వ్యాగన్ టైగున్లకు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. భారత్లో ఎంజీ ఆస్టర్ రూ 9.78 లక్షల (ఎక్స్-షోరూం, ఇండియా) నుంచి అందుబాటులో ఉందని కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్ రాజీవ్ చాబ తెలిపారు. ఎంజీ ఆస్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభిస్తుంది.