Mercedes-Benz S-Class 2021: భారత్లో విలాసవంతమైన కార్లకు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు లంబోర్ఘినీ, మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసే కొత్త మోడళ్ల కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా మెర్సిడెస్ బెంజ్ సరికొత్త కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది.
ఎఎమ్జి లైన్ ట్రిమ్ ఆధారంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 2021 ఎడిషన్ను లాంచ్ చేసింది. భారత్లో డీజిల్ మోడల్ ధర రూ.2.17(ఎక్స్ షోరూమ్ ధరలు) కాగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ.2.19గా నిర్ణయించారు. సరికొత్త ఎస్-క్లాస్ కారును 2020 సెప్టెంబర్లోనే ప్రపంచానికి పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఎస్యూవీలకు ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ లేటెస్ట్ వెర్షన్ ఎస్-క్లాస్ కారుకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మెర్సిడెస్ ఎస్-క్లాస్ లాంచ్ ఎడిషన్ను సీబీయూ మార్గం ద్వా భారత్కు తీసుకురాగా, మొత్తం 150 కార్లలో ఇప్పటికే సగం బుక్ అయ్యాయి. కొత్త ఎస్-క్లాస్తో మంచి రైడ్ అనుభవంతో పాటు అదనపు ఫీచర్లు, కావాల్సినంత స్పేస్ను అందిస్తుంది.