న్యూఢిల్లీ, డిసెంబర్ 13: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ కూడా ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి, కమోడిటీ వ్యయాలు అధికమవడంతోపాటు లాజిస్టిక్ కోసం అయ్యే ఖర్చులు పెరగడం వల్లనే జనవరి 1 నుంచి అన్ని మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో సీ-క్లాస్ మాడల్ రూ.60 వేల వరకు, జీఎల్ఎస్ ఎస్యూవీ మాడల్ రూ.2.6 లక్షలు, మేబాచ్ ఎస్ 680 మాడల్ రూ.3.4 లక్షల వరకు అధికం కానున్నాయి. ప్రస్తుతం సంస్థ రూ.46 లక్షల నుంచి రూ.3.4 కోట్ల లోపు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.