న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ భారత్ మార్కెట్లో నవంబర్ 17న ఏఎంజీ ఏ45ఎస్ను లాంఛ్ చేస్తోంది.హాట్ ఫీచర్స్తో కస్టమర్లను ఆకట్టుకునేలా దివాళీ తర్వాత భారత్ మార్కెట్లోకి ఏఎంజీ ఏ45ఎస్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఏఎంజీ లైనప్లో ఏ45ఎస్ కస్టమర్ల ఆదరణను చూరగొంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజన్తో కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, స్లిప్రీ, ఇండివిడ్యువల్, రేస్ వంటి ఆరు డ్రైవింగ్ మోడ్స్తో ఈ కారు అందుబాటులో ఉంటుంది. ఇక కేవలం 3.9 సెకండ్లలోనే ఏఎంజీ ఏ45ఎస్ సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ లగ్జరీ కారు రూ 80 లక్షలకు అందుబాటులో ఉంటుదని కంపెనీ వెల్లడించింది.