హైదరాబాద్, డిసెంబర్ 27, (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో (ఐసీఏఐ) తెలంగాణ నుంచి ఇద్దరికి సభ్యత్వం లభించింది. 25వ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్కు చెందిన ముప్పాళ్ల శ్రీధర్, దయనివాస్ శర్మ ఎన్నికైనట్టు ఐసీఏఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఐసీఏఐలో దక్షిణాది ప్రాంతీయ నియోజకవర్గం ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆరుగురికి ప్రాతినిథ్యం లభించగా వీరిలో ఇద్దరు తెలంగాణవారు.