Medplus IPO | వచ్చేవారం ఐపీవోకు వెళ్లనున్న హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ఫార్మసీ రిటైల్ చైన్ నెట్వర్క్ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ తన షేర్ ధరను మంగళవారం ఖరారు చేసింది. ఒక్కో షేర్ విలువ రూ.780-796గా నిర్ణయించింది. ఈ నెల 13న మొదలయ్యే మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీవో 15న ముగియనున్నది. రూ.1,398 కోట్ల ఇన్షియల్ షేర్ సేల్స్లో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ నెల 10వ తేదీనే బిడ్లను ఆహ్వానిస్తారు.
రూ.600 కోట్ల విలువ గల షేర్లు ఐపీవో ద్వారా రూ.798.30 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్, వాటాదారులకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద కేటాయిస్తారు. రూ.5 కోట్ల విలువైన షేర్లను మెడ్ప్లస్ ఉద్యోగులకు రిజర్వు చేశారు. ఉద్యోగులకు డిస్కౌంట్ కింద రూ.78 లకే కేటాయిస్తారు. షేర్లలో సగం క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ బయ్యర్లకు, 15 శాతం నాన్ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.
ఇన్వెస్టర్లు కనీసం 18 శాతం ఈక్విటీ షేర్లకు బిడ్ దాఖలు చేయొచ్చు. ఫార్మాస్యూటికల్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్.. ఔషధాలు, విటమిన్లు, మెడికల్ డివైజెస్, టెస్ట్ కిట్స్, హోం అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్తోపాటు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సబ్బులు, డిటర్జెంట్లు, శానిటైజర్లను వినియోగదారులకు మెడ్ప్లస్ అందుబాటులోకి తెస్తున్నది. 2006లో గంగడి మధుకర్రెడ్డి స్థాపించారు. ఆయనే సంస్థ ఎండీ కం సీఈవోగా ఉన్నారు.
తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మెడిప్లస్ స్టోర్లు పని చేస్తున్నాయి. ఐపీవో బ్యాంకర్లుగా యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూయిజ్ సెక్యూరిటీస్ (ఇండియా), నొమురా ఫైనాన్సియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా), ఎడెల్వైస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వ్యవహరిస్తాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఈక్విటీ షేర్లు లిస్ట్ కానున్నాయి.