LIC M-Cap | గతవారం ట్రేడింగ్లో టాప్-5 సంస్థల్లో మూడు సంస్థలు లాభ పడటంతోపాటు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,78,650.71 కోట్లు పెంచుకున్నాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభ పడింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1532.77 (2.90 శాతం) లాభంతో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) భారీగా లాభపడగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ నష్టపోయాయి. గతవారం స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎనిమిది శాతానికి పైగా నష్టపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,31,320.8 కోట్లు పెరిగి రూ.17,73,889.78 కోట్లకు చేరుకున్నది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.30,814.89 కోట్లు పెరిగి రూ.5,46,397.45 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,515.02 కోట్లు లాభపడి రూ.7,33,156.15 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,129.66 కోట్లు పతనమై రూ.6,12,303.26 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.43,743.96 కోట్లు నష్టపోయి రూ.12,05,254.93 కోట్ల వద్ద స్థిర పడింది.
టాప్-10 సంస్థల్లో ఎల్ఐసీ ఆరో ర్యాంక్లో నిలిచింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,639.06 కోట్లు కోల్పోయి రూ.5,22,602.94 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,93,251.86 కోట్ల వద్ద, ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.4,12,763.28 కోట్లు, హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.3,99,512.68 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.3,77,686.72 కోట్ల వద్ద స్థిర పడ్డాయి.