న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచబోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి అన్ని మోడళ్ళ వాహన ధరలను పెంచబోతున్నట్లు సోమవారం ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్లనే ధరలను పెంచాల్సి వస్తున్నదని తెలిపింది. గతేడాదిగా ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు అధికమవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి వాహన ధరలను పెంచకతప్పడం లేదని బీఎస్ఈకి సమాచారం అందించింది సంస్థ. ప్రస్తుతం సంస్థ రూ.2.99 లక్షలు మొదలుకొని రూ.12.39 లక్షల గరిష్ఠ స్థాయి ధర కలిగిన పలు మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు.