Maruti Alto K10 | కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి.. అందునా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు గిరాకీ పెరుగుతున్నది. ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ కార్లకు డిమాండ్ పడిపోతున్నది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఈ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. దాదాపు రెండున్నరేండ్ల క్రితం అంటే 2020 మార్చిలో ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఆల్టో కే10 కారును మళ్లీ విపణిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది.
పెద్దగా పోటీ లేని హ్యాచ్బ్యాక్ ఎంట్రీ లెవెల్ కార్లలో ఆల్టో కే10కు కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతి ఎస్ప్రెస్సో, రెనాల్డ్కు చెందిన క్విడ్ మోడల్ కార్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్లో ఈ రెండు కార్ల వాటా 7.8 శాతంగా ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు.
22 ఏండ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఆల్టో మోడల్ కార్లు ఇప్పటివరకు 43 లక్షల యూనిట్లు అమ్ముడు అయ్యాయి. భారత్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన ఎంట్రీ లెవెల్ కారుగా నిలిచింది. 2012 వరకు ఫస్ట్ జనరేషన్ కారును విక్రయించింది మారుతి. 2010లో ఆల్టో కే10 కారును తీసుకొచ్చింది. ముందు 998 సీసీ కెపాసిటీ, తదుపరి 1061 సీసీ సామర్థ్యం గల ఇంజిన్లతో కూడిన కార్లు రూపొందించారు. 2012లో మార్కెట్లోకి వచ్చిన ఆల్టో 800 కారుకు డిమాండ్ పెరగడంతో ఆల్టో కే10 కారును ఉపసంహరించాలని మారుతి నిర్ణయించింది.