న్యూఢిల్లీ, జూలై 27: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,036 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కరోనా దెబ్బకు రూ.475 కోట్లు మాత్రమే ఆర్జించింది. కంపెనీ విక్రయాలు రూ.17,776 కోట్ల నుంచి రూ.26,512 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనాతో ప్లాంట్లను మూసివేయడం, విక్రయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేకపోయామని, ఈసారి మాత్రం భారీగా పుంజుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించింది.