న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు జోరందుకున్నాయి. విదేశాలకు ఎగుమతులూ ఆకర్షణీయంగా సాగుతున్నాయి. మే నెలలో మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ తదితర సంస్థలు భారీగా అమ్మకాలను నమోదు చేశాయి. ద్విచక్ర సంస్థల్లోనూ హోండా, టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ ఆకట్టుకున్నాయి. నిరుడు మే నెలతో పోల్చితే గత నెలలో పెద్ద ఎత్తున సేల్స్ పెరిగినట్టు బుధవారం విడుదలైన గణాంకాలనుబట్టి స్పష్టమవుతున్నది. లో బేస్ ఎఫెక్ట్ కనిపిస్తున్నా..మార్కెట్లో కొనుగోలు శక్తి మాత్రం పుంజుకున్నట్టు రుజువైంది. ఇక సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నప్పటికీ.. డిమాండ్కు తగ్గ పంపిణీలను ఆటో కంపెనీలు చేయడం విశేషం.