న్యూఢిల్లీ : భారత్లో మారుతి సుజుకి న్యూ ఎస్యూవీ జిమ్నీ (Maruti Suzuki Jimny) లాంఛ్ అయింది. ఐదు డోర్లతో కూడిన ఈ ఎస్యూవీ దేశీ మార్కెట్లో రూ. 12.74 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. జిమ్నీ కస్టమర్ డెలివరీలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఎస్యూవీ విక్రయాలు మారుతి నెక్సా అవుట్లెట్స్ నుంచి జరగనున్నాయి. జిప్సీ వారసత్వాన్ని కొనసాగేలా రూపొందిన ఈ ఎస్యూవీ ఓల్డ్ కే15బీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిఉంది.
ఇక మారుతి సుజుకి జిమ్నీ మైలేజ్ లీటర్కు 16.94 కిలోమీటర్లు. మారుతి సుజుకి జిమ్నీ మహీంద్ర థార్కు దీటైన పోటీ ఇవ్వనుంది. జిమ్నీ ఫీచర్ల విషయానికి వస్తే వాషర్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, ఫాగ్ ల్యాంన్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్బుల్, రీట్రేసబుల్ ఓఆర్వీఎంలతో ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్తో ఎస్యూవీ ఆకట్టుకోనుంది. 15 ఇంచ్ అలాయ్ వీల్స్, హార్డ్ టాప్, డ్రిప్ రెయిల్స్, క్లామ్షెల్ బాయ్నెట్ వంటి ఫీచర్లతో ఈ ఎస్యూవీ కస్టమర్ల ముందుకొచ్చింది.
క్యాబిన్ లోపల హెచ్డీ డిస్ప్లేతో 9 ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రొ+ ఇన్ఫోటెయిన్మెంట్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కైమ్స్ సరౌండ్ సౌండ్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ను కలిగిఉంది. ఇక సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే ఆరు ఎయిర్బ్యాగ్లతో పాటు బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి.
Read More