న్యూఢిల్లీ, జూన్ 14: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఖరీదైన మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ మల్టీ పర్పస్ వాహనమైన ‘ఇన్విక్టో’ను వచ్చే నెల తొలివారంలో ప్రవేశపెట్టబోతున్నది.
ఈ మాడల్ ధర ఇంచుమించుగా రూ.20 లక్షల స్థాయిలో ఉంటుందని మారుతి సుజుకీ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ సూచనప్రాయంగా చెప్పారు. బెంగళూరులో టయోటాకు ఉన్న ప్లాంట్లో ఈ మాడల్ తయారైంది. మహీంద్రా, టాటా, హ్యుందాయ్, కియాలకు పోటీగా ఈ వాహనం విడుదల చేస్తున్నది.